AP Smart Phones To Anganwadi Workers: అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ సర్కార్ శుభవార్త. గర్భిణులు, చిన్నారులకు సేవలు మెరుగుపరచడానికి 58,402 మందికి రూ.12,500 విలువైన సామ్సంగ్ మొబైల్స్ అందిస్తోంది. విజయవాడలో నేడు మంత్రి చేతుల మీదుగా మొబైలస్ను పంపిణీ చేయనున్నారు. మరోవైపు, సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో జీఎస్డీపీ వృద్ధిపై, ఆర్థిక ఫలితాలపై నేడు సమీక్షించనున్నారు. టెన్నిస్ ప్లేయర్ మైనేని సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ పదవి దక్కింది.