Andhra Pradesh Diet Charges Increase Proposal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతేకాకుండా హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. డైట్ ఛార్జీలు పెరిగితే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు.