AP Minority Students Free Neet Eapcet Training: ఏపీ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఉచితంగా నీట్, ఈఏపీసెట్ పరీక్షల కోసం శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కీలక ప్రకటన చేశారు. 45 రోజుల పాటూ ఉచితంగా శిక్షణ అందిస్తామని.. మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న మైనార్టీ విద్యార్థులకు ఇది మంచి అవకాశం.