Andhra Pradesh Cut Power Charges: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖలో నూతనంగా నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. తండాలు, గూడేలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలో రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు.