గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో పవన్ కళ్యాణ్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరం గురించి చర్చించారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలన్న పవన్ కళ్యాణ్.. ఏజెన్సీ ప్రాంతాల్లో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకం ఉద్యాన పంటలకు అనుసంధానిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.