ఏపీ రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని లంక భూములలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. వేయి ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు మరో 1500 ఎకరాలు సమీకరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.