కేంద్ర జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయగణన ప్రక్రియలో భద్రాచలం పట్టణానికి సంబంధించి వింత సమస్య ఎదురవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ పట్టణం, ఆన్లైన్ పోర్టల్లో మాత్రం తెలంగాణ వెలుపల ఉన్నట్లు చూపిస్తోంది. జియో కోడింగ్ పరిమితుల వల్ల స్థానికులు తమ వివరాలను నమోదు చేసుకోలేకపోతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మార్వో స్పందిస్తూ.. సమస్యను సాంకేతిక బృందం దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.