ఏపీలోని ఆ ఊర్లోకి రాజకీయ నేతలకు నో ఎంట్రీ.. ఏకంగా బోర్డే పాతేశారు..

2 months ago 8
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓ ఊరి జనం మండిపడుతున్నారు. తమ ఊరిలోకి రాజకీయ నాయకులకు ప్రవేశం లేదంటూ ఏకంగా బోర్డు పెట్టేశారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదోని మండలాన్ని ఏపీ ప్రభుత్వం రెండుగా విభజించింది. ఆదోని -1, ఆదోని -2గా విభజించింది. అయితే తమ ఊరిని మండలంగా ప్రకటించాలంటూ పెద్ద హరివాణం గ్రామస్థులు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ గ్రామాన్ని మండల కేంద్రంగా చేసే వరకూ ఏ రాజకీయ నేతను తమ ఊరిలోకి రానివ్వమంటూ బోర్డు పెట్టారు.
Read Entire Article