ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే గత 15 నెలల కాలంలో ఏపీలో 12 వేలకోట్లకు పైగా పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు పలు సంస్థ ముందుకు వచ్చాయి. తాజాగా కర్నూలు జిల్లాలో రిలయన్స్ సంస్థ రూ.1700 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలోనే ఏడు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు కానుండటం విశేషం.