Andhra Pradesh District More Deaths Than Births: ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాలో, తెలంగాణలోని మరో జిల్లాల్లో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2021లో దేశవ్యాప్తంగా 49 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచే 34 జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితికి కరోనా మహమ్మారితో పాటు ఇతర కారణాలు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.