సాగరతీరం విశాఖపట్నం అభివృద్ధి మీద ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతో విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. అయితే నిర్మాణ రంగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోందని బిల్డర్లు చెప్తున్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టులలో పురోగతి ఉన్నప్పటికీ.. నైపుణ్యం కలిగిన సిబ్బంది సరైనంతగా లేకపోవటంతో అమల్లో జాప్యం జరుగుతోందని చెప్తున్నారు. దీంతో ఖర్చులు పెరుగుతున్నాయని వెల్లడిస్తు్న్నారు.