ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద అనేక రైల్వే్ స్టేషన్లలో అభివృద్ధి్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ కొత్త శోభను సంతరించుకుంది. రూ.19 కోట్ల నిధులతో స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్లాట్ ఫామ్ల ఆధునీకరణ, వెయిటింగ్ హాళ్ల అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యాయి. ఈ ఫోటోలను రైల్వేశాఖ షేర్ చేసింది.