AP SIPB Approves Rs 53922 Crore Investment: ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో రూ.53,922 కోట్ల పెట్టుబడులతో 30 సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 83,437 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖపట్నంలో గూగుల్ రూ.50 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్స్కేల్ డేటా సెంటర్ కానుంది. దీని ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.