Andhra Pradesh School Holidays Today: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను వణికించింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటింది. అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా ప్రారంభమవుతాయి. ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అయితే తుఫాన్ ప్రభావం తగ్గినా సరే ఇవాళ కూడా మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.