విద్యుత్ వినియోగదారుల కోసం ఏపీసీపీడీసీఎల్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 శాతం రాయితీతో అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. మార్చి ఒకటి నుంచి ఏపీసీపీడీసీఎల్ తమ విద్యుత్ వినియోగదారులకు ఈ అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్ 30తో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.