జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు కసరత్తు మొదలైంది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. శుక్రవారం విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్లకు మంత్రి కీలక సూచనలు చేశారు.