తెలంగాణలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి స్థానంలో వచ్చిన భూభారతి నూతన చట్టం కింద ఈ ప్రక్రియ మొదలైంది. 2014 జూన్ 2కు ముందు తెల్ల కాగితాలపై భూములు కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులు అర్హులు. భూమిని 12 ఏళ్లకు పైగా ఆధీనంలో ఉంచుకున్న వారికి మాత్రమే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. అయితే.. పాత యజమాని నుంచి అఫిడవిట్ పొందాలనే నిబంధన రైతులకు ప్రస్తుతం సమస్యగా మారుతోంది. నల్గొండ జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేశారు.. ఎంత మందికి నోటీసులు వచ్చాయి అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.