ఏసీ గదుల్లో కూర్చుని కాదు.. అమరావతికి వస్తే తెలుస్తుంది.. మంత్రి నారాయణ

1 year ago 24
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలో పర్యటించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ -1, టైప్ 2 ఇళ్లను పరిశీలించారు. పనుల పురోగతిపై సీఆర్డీయే ఇంజినీర్లు,కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. అమరావతి గురించి ఏసీ రూములో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న నారాయణ.. అమరావతి మునిగిపోయిందని దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారన్నారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అధారిటీ ఆమోదించిందన్న మంత్రి.. భూసేకరణ, భూసమీకరణ అనేది ప్రజలదే ఛాయిస్ అని అన్నారు.భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
Read Entire Article