ఏసీబీ, ఈడీ విచారణకు వెళ్తా కానీ.. కండీషన్ పెట్టిన కేటీఆర్

1 year ago 31
ఫార్ములా ఈ- కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా కొట్టిపారేశారు. ఏసీబీ, ఈడీ విచారణకు తాను సిద్ధమేనన్న కేటీఆర్.. అయితే రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కు ప్రకారం న్యాయవాదులతో హాజరవుతానని స్పష్టం చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే తన విచారణ జరగాలన్నారు. ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంపై రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Entire Article