కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేదికపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 30 లక్షలకు దక్కించుకుంది. రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లలో తన బ్యాటింగ్ సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించిన అమన్.. కరీంనగర్ నుంచి ఐపీఎల్కు ఎంపికైన తొలి ఆటగాడిగా నిలిచాడు.