ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారనే అభియోగాలపై సంజయ్ మీద ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా సంజయ్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి సంజయ్ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు పలుమార్లు కొట్టివేసింది. ఎట్టకేలకు సోమవారం రోజున బెయిల్ మంజూరు చేసింది.