హైదరాబాద్లో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రాబోతోంది. మెట్రో, ఎంఎంటీఎస్, టీజీఎస్ఆర్టీసీ సేవలను అనుసంధానం చేస్తూ 'ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్'ను నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే డిజిటల్ కార్డుతో మూడు రవాణా వ్యవస్థల్లోనూ ప్రయాణించే సౌకర్యం త్వరలో సాకారం కానుంది.