ఒక్క రూపాయితో.. అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సంపూర్ణ భోజనం..

2 months ago 9
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కరుణ కిచెన్ నిరుపేదలకు అక్షయపాత్రలా మారింది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఈ కిచెన్ కేవలం ఒక్క రూపాయికే కడుపు నిండా, నాణ్యమైన భోజనాన్ని అందిస్తోంది. వ్యవస్థాపకులు రాకేష్ ప్రకారం.. ఆకలి లేని సమాజమే తమ ఏకైక లక్ష్యం అన్నారు. ఆటో డ్రైవర్లు, కూలీలు సహా వేలాది మందికి ప్రతిరోజూ అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. దాతల సహకారంతో నడుస్తున్న ఈ సేవ, పేదరికంపై పోరాటంలో మానవత్వం విలువను చాటి చెబుతోంది.
Read Entire Article