మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోకిరీల భరతం పడుతోంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తోంది. తాజాగా.. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరిని పట్టుకునేందుకు పోలీసులు 100 కెమెరాలను పరిశీలించారు, 300 వాహనాలను జల్లెడ పట్టి అతడిని పట్టుకున్నారు.