తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. ప్రతి సహకార సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు కోసం రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ పంట దీర్ఘకాలిక పంటతో ఎకరాకు రూ. 1.5 నుండి రూ. 3 లక్షల వరకు నికర ఆదాయం వస్తుందని చెప్పారు.