తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్లో కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే సూర్యాపేట జిల్లాలో ఏకంగా ఎన్నికల అధికారినే గ్రామస్థులు బంధించినట్లు తెలుస్తోంది. అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని, ఉప సర్పంచ్ పదివిని ముందే ప్రకటించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఓ అభ్యర్థి ట్రాక్టర్తో బీభత్సం సృష్టించారు. ఓడిపోయిన అభ్యర్థి, అతడి అనుచరులను ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ ఘటనల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.