Kadapa Electric Scooty Blast Woman Death: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో గురువారం రాత్రి జరిగిన విషాద ఘటనలో ఎలక్ట్రిక్ స్కూటీ పేలి వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళ మృతి చెందారు. స్కూటీ ఛార్జింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ సమస్య లేదా ఛార్జింగ్ సాకెట్ లో లోపం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె పక్కనే నిద్రిస్తుండటంతో మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.