కడపలో మహానాడు ఏర్పాటుకు కారణమదే.. చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

5 days ago 9
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు మాట్లాడుతూ.. కడపలోనే మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నామో తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో దేవుని గడప కడపలో తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడుని కడపలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాక గత ఎన్నికల్లో కడపలో కూటమి 10 సీట్లకు గాను 7 సీట్లు గెలుచుకుందని..వైసీపీ మూడు సీట్లతోనే సరిపెట్టుకుందని చంద్రబాబు తెలిపారు. ఈ లెక్కన చూస్తే.. కడపలో కూటమి గాలి ఏ రేంజ్‌లో వీచిందో చెప్పనక్కర్లేదు అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కడపలో మహానాడు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 34 మహానాడులు జరిగాయని.. రెండు డిజిటల్‌గా జరిగాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏడాది దేవుని గడపలో జరుగుతున్న మహానాడు ఓ చరిత్ర సృష్టించబోతుందన్నారుని చంద్రబాబు తెలిపారు. అదేంటంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో కూటమి 10 స్థానాల్లో 7 స్థానాలు గెలిచామని, ఇంకాస్త కష్టపడితే ఈసారి పదికి పది మనమే గెలుస్తామన్నారు. కడపలో ఇకపై టీడీపీ జెండా రెపరెపలాడాలన్నారు. రాయలసీమ ప్రజలు అందించిన అద్భుత విజయానికి కృతజ్ఞతగా కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2024లో పార్టీ సాధించిన విజయం అసమాన్యమని కొనియాడారు. సుమారు 93 శాతం స్ట్రైక్‌ రేట్‌తో.. 53 శాతం ఓట్లతో కూటమి విజయాన్ని సాధించినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Entire Article