కన్నా.. కర్మకాండలు చేయండిరా.. మూడు రోజులుగా ఇంటి ముందే తండ్రి మృతదేహం..

4 months ago 9
పల్నాడు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాలు చేయలేదనే కారణంతో తండ్రి మృతదేహాన్ని ఇంటి బయటే వదిలేశారు ఇద్దరు ప్రబుద్ధులు. కనిపెంచిన తండ్రి అనారోగ్యంతో చనిపోతే.. ఖర్మకాండలు జరిపించాల్సిన ఆ ఇద్దరు కుమారులు.. ఆస్తిని పంచలేదనే కారణంతో అంత్యక్రియలు నిర్వహించకుండా మూడు రోజులుగా తండ్రి మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచారు. చివరకు గ్రామపెద్దలు, పోలీసులు ఎంత చెప్పినా వినకుండా.. ఆస్తి పంచితేనే తప్ప అంత్యక్రియలు చేయమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ఇద్దరు కొడుకుల అమానవీయ వైఖరితో పాపం ఆ తండ్రి మృతదేహం.. రోడ్డుపై, ఇంటి ముందు అలా ఉండిపోయింది మూడురోజులుగా.. పల్నాడు జిల్లా పాతసొలసలో జరిగిన ఈ ఘటన చూసిన వారినే కాకుండా విన్నవారికి కూడా కంటతడి పెట్టిస్తోంది.
Read Entire Article