హుస్నాబాద్ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా హుస్నాబాద్ను సిద్దిపేటలో కలిపిందని.. శాస్త్రీయంగా సరిహద్దులు మార్చినప్పుడు దీనిని పాత జిల్లాలోనే చేరుస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాల సరిహద్దుల సవరణపై ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇదే క్రమంలో వంగర కేంద్రంగా ‘పి.వి. నరసింహారావు జిల్లా’ ఏర్పాటు చేయాలని ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. పరిపాలనను సులభతరం చేసేలా జిల్లాల పునర్విభజన ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది.