ఏపీలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం సౌర విద్యుత్ అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పీఎం సూర్యఘర్ పథకం కింద రాష్ట్రంలోని 20 లక్షల కనెక్షన్లకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇవ్వనున్నారు. అలాగే ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నందుకు చదరపు అడుగుకు రూపాయి చొప్పున లీజు చెల్లించనున్నారు.