విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల సమయంలో విద్యు్త్ ఛార్జీలను పెంచమని హామీ ఇచ్చామన్న చంద్రబాబు.. మాట ప్రకారం కరెంట్ ఛార్జీలను పెంచలేదన్నారు. అలాగే వచ్చే ఎన్నికల వరకూ కరెంట్ ఛార్జీలను పైసా కూడా పెంచమని చంద్రబాబు హామీ ఇచ్చారు. పమిడిముక్కల పర్యటనలో చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు.