కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఐదుగురు ఏపీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. బాధితులు కర్నూలు జిల్లా కౌతాళం మండలానికి చెందినవారిగా నిర్ధారించారు. రెండు బొలెరో వాహనాలు పరస్పరం వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గొర్రెలు కొనేందుకు సింధనూరుకు వెళ్లిన కర్నూలు వాసులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.