చిన్న టేకూరు దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సులో 19 మంది సజీవ దహనమైన ఘోర ప్రమాదం ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం అయిన బైకర్ శివశంకర్తో పాటు బస్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. డ్రైవర్ లక్ష్మయ్యకు అర్హత లేకున్నా హెవీ లైసెన్స్ వచ్చిందని, గతంలోనూ ప్రమాదాలున్నాడని తేలింది. మద్యం అలవాటు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురి మీద ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.