భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో గురువారం పర్యటించారు. ఆయన కర్నూలు జిల్లా నన్నూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. అయితే, ఈ సభ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. సూపర్ జీఎస్టీ సభలో విద్యుత్ షాక్తో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు. కాంగ్రెస్ నినాదాలు, పోలీసుల అరెస్టుల మధ్య ఈ ఘోరం జరిగింది. భారీ ఏర్పాట్లు, పటిష్ట భద్రత మధ్య జరిగిన ఈ సభలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.