Kurnool AP High Court Bench: రాయలసీమలో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ హైకోర్టులో పెండింగ్లో ఉందని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాల విషయంలో కాస్త గందరగోళం ఉందని.. ఈ విషయం తమ దృష్టికి రాగా.. హైకోర్టు రిజిస్ట్రార్కు నివేదిక అందిస్తామన్నారు. ఈమేరకు అసెంబ్లీలో న్యాయ, మైనార్టీ శాఖలకు సంబంధించి బడ్జెట్ను ఆమోదించారు. శాంతిభద్రతలపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.