కర్నూలులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి కొద్దిలో పెనుప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం ఉదయం అశోక్నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. కరెంట్ స్తంభం కూలిపోవడాన్ని గమనించిన చుట్టుపక్కల గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆ విద్యార్థి అప్రమత్తమై వెనక్కి పరుగు తీశాడు.. అతను వెనుదిరిగిన క్షణకాలంలోనే విద్యుత్ స్తంభం నేలకూలింది. అయితే త్రుటిలో అక్కడి నుంచి బాలుడు బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.