Female Farmer: హుస్నాబాద్లో అకాల వర్షం రైతుల కష్టాలను ముంచెత్తింది. అమ్మకానికి తెచ్చిన ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో ఓ మహిళా రైతు గుండెలవిసేలా విలపించింది. ఏడాది కష్టం నీటిలో కలిసిపోయిందని బాధతో రోదించింది. వడ్లను డ్రైనేజీ నుంచి ఎత్తుకుంటూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తన వంటి రైతులను ఆదుకోవాలని వేడుకుంది. కలెక్టర్ కాళ్లు మొక్కి న్యాయం చేయాలంటూ కన్నీరుమున్నీరైంది. రైతుల బాధను ప్రతిబింబించిన ఈ ఘటన అందరినీ కదిలించింది.