హైదరాబాద్ చింతల్లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఇద్దరు కవల పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల పిల్లల్లో ఒకరికి మాటలు సరిగా రావడం లేదనే కారణంతో భర్త మానసికంగా వేధించడంతో ఈ ఘోరం జరిగింది. తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో సందేశం రికార్డ్ చేసి.. ఆపై భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.