సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడడంలో బ్యాంక్ ఉద్యోగులు పాత్ర కీలకమని, బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల బారిన పడిన బాధితులు ఆందోళనతో డబ్బు విత్డ్రా చేస్తున్నప్పుడు బ్యాంకర్లు వారిని గమనించి ఆరా తీయాలన్నారు. ముఖ్యంగా వృద్ధుల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని.. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా కోరారు.