కాంగ్రెస్ పార్టీలోకి కవిత..? తెలంగాణ పీసీసీ చీఫ్ ఏమన్నారంటే..

1 month ago 4
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. కవిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కేవలం వదంతులేనని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కవిత చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ నాయకత్వమే జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని ప్రజలు ఆదరించరని, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని వివరించారు.
Read Entire Article