Singareni Employees: సింగరేణి సంస్థలోని కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐసీ సౌకర్యం కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ పథకాన్ని ముందుగా కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల్లోని సుమారు 2,500 మందికి వర్తింపజేస్తారు. నెలకు రూ.21,000 లోపు వేతనం ఉన్న కార్మికులు అర్హులు. ముఖ్యంగా.. గుత్తేదారు తరఫున చెల్లించాల్సిన 3.75 శాతం వాటాను సింగరేణి యాజమాన్యమే భరించనుంది. దీని ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు పరిమితి లేని వైద్య సేవలు వేతనంతో కూడిన సెలవులు లభిస్తాయి.