భర్త వద్దు.. ప్రియుడే కావాలంటూ కాకినాడ జిల్లాలో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. భర్త తనను నిత్యం వేధిస్తున్నాడని.. అలాంటి భర్త తనకు వద్దని వాపోయింది. ప్రియుడితోనే ఉంటానని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో భర్త, కుటుంబసభ్యులపై ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త వేధిస్తున్నా కూడా తన కుటుంబసభ్యులు ఆయనతోనే ఉండాలని చెప్తున్నారని ఫిర్యాదు చేసింది. అలాగే సాటి మహిళగా హోంమంత్రి అనిత తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది.