కాచిగూడ రైల్వే స్టేషన్లో వరంగల్కు చెందిన మణిదీప్ అనే ప్రయాణికుడికి ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. ఈ నెల 26న బెంగళూరు వెళ్లేందుకు వేరే బోగిలోకి ఎక్కిన మణిదీప్, రైలు కదులుతుండగా కిందకు దిగేందుకు ప్రయత్నించి రైలు చక్రాల కింద పడబోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతడిని పక్కకు లాగడంతో, మణిదీప్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.