ISO Certificate to Kanipakam Vinayaka Temple: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. భక్తులకు అందిస్తున్న సేవలు, ఆలయ నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి హైదరాబాద్కు చెందిన హైమ్ సంస్థ ఈ గుర్తింపును అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాణిపాకం ఆలయానికి క్యూ త్రీస్టార్ రేటింగ్ దక్కింది. ఇది ఆలయ అధికారులు, సిబ్బంది కృషికి దక్కిన గౌరవం అంటున్నారు.