గాదె సాయికృష్ణ కేసులో అతని తల్లి విజయలక్ష్మి శనివారం మెజిస్టీరియల్ విచారణకు హాజరయ్యారు. తన అభిప్రాయాలను సబ్కలెక్టర్ ఎదుట వినిపించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి.. తన కొడుకును సీఐ నాగరాజు దారుణంగా చంపేశాడని ఆరోపించారు. కనీసం బూడిదైన ఇవ్వమని కోరుతుంటే.. అది కూడా సాధ్యపడటం లేదన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు.