IPS Pv Sunil Kumar Kapu Comments: కాపులు, దళితులు ఏకమైతే అధికారం తమదేనని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తావిస్తూ, కాపులు దళితులతో కలిస్తే బలం రెట్టింపు అవుతుందని, ముఖ్యమంత్రి పదవికి కాపు నాయకుడిని, ఉప ముఖ్యమంత్రి పదవులకు దళిత నాయకులను ప్రతిపాదించారు. అందరినీ కలుపుకొని పోవాలని, తమ నిధులు, పంచాయతీలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్.