టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబరాబాద్లో ఓ ఐటీ ఉద్యోగి తన కాబోయే భార్యతో సహా వందలాది మంది మహిళల ఫోటోలను డీప్ఫేక్ టెక్నాలజీతో అసభ్యంగా మార్చిన ఘటన కలకలం రేపింది. ఏఐని ఆయుధంగా చేసుకుని పైశాచికానందం పొందుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.