కార్తీక మాసం సందర్భంగా శివుడి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ప్రముఖ శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి శ్రీశైలంతో పాటుగా పంచారామ క్షేత్రాలు, శబరిమలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కార్తీక మాసంలో శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.