కార్యాలయాలకు చేరిన బతుకమ్మ చీరలు.. ఈ నెల 19న పంపిణీ.. అర్హులు వీరే..

5 months ago 13
బతుకమ్మ చీరల పంపిణీకి ఈసారి డ్వాక్రా మహిళలకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో మాదిరిగా రేషన్ కార్డు కాకుండా.. డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం తప్పనిసరి. తాండూర్ మండల పరిషత్ కార్యాలయానికి 25 వేల మంది మహిళలకు అవసరమైన చీరలు చేరుకున్నాయి. ఈ నెల 19న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article